అక్కినేని ఫ్యామిలీకి అదిరిపోయే హిట్ ను ఇచ్చిన దర్శకుడు విక్రం కుమార్. ‘మనం’తో అందరి మనసులను దోచుకున్నాడు. తాజాగా, విక్రమ్ మరో లక్కీ ఛాన్స్ ను కొట్టేశాడు. త్వరలో తమిళ స్టార్ హీరో సూర్యను డైరెక్ట్ చేయనున్నాడు. ఇటీవల, సూర్యకు ఓ కథను వినిపించాడు విక్రమ్. కథ బాగా నచ్చడంతో సినిమా చేయడానికి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రస్తుతం వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేస్తున్నాడు సూర్య. ఇది ముగియగానే విక్రమ్ ప్రాజెక్ట్ ప్రారంభించినున్నట్లు కోలీవుడ్ సమాచార్. వెంకట్ ప్రభు కార్తీతో ‘బిర్యానీ’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment